తెలుగు రాష్ట్రాల్లో ఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి

తెలంగాణ రాష్ర్టంలో సమాజ్ వాది పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమాజ్ వాది
పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. ఇటీవలనే పార్టీలో చేరిన నాయకులు జిల్లాల
వారీగా పార్టీ శ్రేణులను ఏకంచేస్తూ ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలనే నిర్ణయానికి
వచ్చారు. సమాజ్ వాది పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్యక్షుడు పాశం వెంకటేశ్ ను సమాజ్ వాది పార్టీ
నాయకుడిని ఇటీవల ఎస్పీ పార్టీలో చేరిన సోషియల్ ఆక్టివిస్ట్ దండుబోయిన నిత్యకళ్యాణ్ యాదవ్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు
నర్సింగ్ మాదిగలు మర్యాపూర్వకంగా కలిశారు. శాలువతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణలో సమాజ్ వాది పార్టీ బలోపేతం కొరకు తాము చేస్తున్న కృషిని నిత్యకళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వెంకటేశ్ కు వివరించారు. పార్టీ తరఫున
తాను చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. దాంతో
నిత్యకళ్యాణ్ ను అధ్యక్షుడు వెంకటేశ్ అభినందించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న వెంకటేశ్ ను కలవడం ఎంతో ఆనందంగా వుందని నిత్యకల్యాణ్ అన్నాను. తెలుగురాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా ముందుకు సాగడం జరుగుతుందని వెంకటేశ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతుందని వారు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *